చిత్రం: ఇదా లోకం (1973)
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
గానం: రామకృష్ణ, పి.సుశీల
సంగీతం: చక్రవర్తి
పల్లవి :
నీ మనసు నా మనసు ఏకమై
నీ నీడ అనురాగ లోకమై
ప్రతి జన్మలోన జతగానే ఉందాములే..ఏ ఏ ఏ
ఓ ఓ ఓ..హో..
ఆ ఆ ఆ నీ మనసు నా మనసు ఏకమై ఈ ఈ....
చరణం 1 :
చలిగాలి తొలిమబ్బు పులకించి కలిసే
మనసైన చిరుజల్లు మనపైన కురిసే
దూరాన గగనాల తీరాలు మెరిసే
మదిలోన శతకోటి ఉదయాలు విరిసే
ఆ..ఆ..పరువాల బంగారు కిరణాలలో
ఆ..ఆ..కిరణాల జలతారు కెరటాలలో
నీవే నేనై ఉందాములే..
ఆ ఆ..ఓ ఓ..ఆ ఆ ఆ ఆ...
నీ మనసు నా మనసు ఏకమై...
చరణం 2 :
ఆ..ఆ...ఏనోములో నిను నా చెంత నిలిపే
ఏ దైవమో నేడు నిను నన్ను కలిపే
నీ పొందులో ప్రేమ నిధులెన్నో దొరికే
నీతోనే నా పంచ ప్రాణాలు పలికే
ఈ..ఈ..జగమంత పగబూని ఎదిరించినా
ఆ..ఆ విధి ఎంత విషమించి వేధించినా
నీవే నేనై ఉందాములే ..
ఆ ఆ..ఓ ఓ..ఆ ఆ ఆ ఆ...
నీ మనసు నా మనసు ఏకమై
నీ నీడ అనురాగ లోకమై
ప్రతి జన్మలోన జతగానే ఉందాములే...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి