చిత్రం : ఈనాటి బంధం ఏనాటిదో (1977)
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: ఎం. బాలయ్య
గానం: పి. సుశీల
పల్లవి:
ఎవరికి చెప్పేది? ఏమని చెప్పేది?
నేనెవరికి చెప్పేది మనసిప్పేమని చెప్పేది
హోరున వీచే గాలికా.. చిరుగాలికా..
ఉరకలు వేసే నీటికా.. సెలయేటికా..
ఎవరికి చెప్పేది? ఏమని చెప్పేది?
చరణం 1:
నీటిలోని కలువను నేను.. నింగినేలే జాబిలి తాను
నీటిలోని కలువను నేను.. నింగినేలే జాబిలి తాను
నన్నే తలచి మదిలో వలచి
నన్నే తలచి మదిలో వలచి
దివి నుండి తానె దిగి రాగా ఆ ఆ ఆ...
కలవరపరచే కమ్మని తలపులు.. ఇవి.. ఇవి..
అని ఎవరికి చెప్పేది? ఏమని చెప్పేది?
చరణం 2:
మల్లె తీగలు పందిరి కోసం ఎదిగెదిగి ఎగబాకిన చందం
మల్లె తీగలు పందిరి కోసం ఎదిగెదిగి ఎగబాకిన చందం
పొందు కోరి పొంచిన పరువం
పొందు కోరి పొంచిన పరువం
నచ్చిన వానిని పెనేసుకోదా.. ఆ ఆ ఆ..
ఉప్పెనలా వచ్చే ఊహలు ఇవి.. ఇవి..
అని ఎవరికి చెప్పేది? ఏమని చెప్పేది?
నేనెవరికి చెప్పేది మనసిప్పేమని చెప్పేది
హోరున వీచే గాలికా చిరుగాలికా
ఉరకలు వేసే నీటికా సెలయేటికా..
లాల లలల లలాలల
లాల లలల లలాలల
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి