చిత్రం: తండేల్ (2025)
సాహిత్యం: శ్రీ మణి
గానం: జావేద్ ఆలీ
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
పల్లవి :
గాలిలో ఊగిసలాడే దీపం లా
ఊగిసలాడే నీ ఊసందక నా ప్రాణం
నల్లని మబ్బులను చుట్టిన చంద్రుడిలా
చీకటి కమ్మెను నీ కబురందక నా లోకం
సుడిగాలిలో పడి పడి లేచే పడవల్లే తడబడుతున్న
నీ కోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైన మాటాడే
నా బుజ్జి తల్లి….
చరణం 1 :
నీరులేని చేపల్లే తార లేని నింగల్లె
జీవమేది నాలోన నువ్వు మాటలాడందే
మళ్ళి యాలకొస్తనే కాళ్ళ ఏళ్ళ పడతానే
లెంపలేసుకుంటానే ఇంక నిన్ను యిడిపోనే
ఉప్పు నీటి ముప్పుని కూడా గొప్పగా దాటే గట్టోడ్నే
నీ కంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే
నీ కోసం వేచుందే నా ప్రాణం
ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాటాడే
నా బుజ్జితల్లి…
చరణం 2 :
ఇన్ని నాళ్ళ మన దూరం తియ్యనైన ఓ విరహం చేదు లాగ మారిందే అంది రాక నీ గానం దేన్ని కానుకియ్యాలే ఎంత బుజ్జగించాలే బెట్టు నువ్వు దించేలా లంచమేంటి కావాలే గాలి వాన జాడే లేదా రవ్వంతైనా నా చుట్టూ అయినా మునిగిపోతున్నానే దారే చూపెట్టూ నీ కోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాటాడే నా బుజ్జితల్లి…
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి