చిత్రం:మల్లీశ్వరి (2004)
రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: కుమార్ సాను, సునీత
సంగీతం: కోటి
నీ నవ్వులే వెన్నెల్లని మల్లెలని హరివిల్లులని ఎవరేవేవో అంటె అననీ యేం చెప్పను యేవి చాలవని నీ నవ్వులే వెన్నెల్లని మల్లెలని హరివిల్లులని ఎవరేవేవో అంటె అననీ యేం చెప్పను యేవి చాలవని బంగారం వెలిసి పోదా నీ సొగసుని చూసి మందారం మురిసిపోదా నీ సిగలో పూసి వేవేల పువ్వులను పోగేసి నిలువెత్తు పాల బొమ్మని చేసి అణువణువు వెండి వెన్నెల పూసి విరి తేనే తోనే ప్రాణం పోసి ఆ బ్రహ్మ నిను మళ్ళి మళ్ళి చూసి తన్ను తానే మెచ్చుకోడా ముచ్చటేసి ఎవరేవేవో అంటె అననీ యేం చెప్పను యేవి చాలవని పగలంత వెంట పడిన చూడవు నా వైపు రాతిరంత కొంటె కలవై వదలవు కాసేపు ప్రతి చోట నువ్వే యెదురొస్తావు ఎటు వెళ్ళలేని వలవేస్తావు చిరునవ్వుతోనె ఉరివేస్తావు నన్నెందుకింత ఊరిస్తావు ఒప్పుకోవేం నువ్వు చేసిందంతా చేసి... తప్పు నాదంటావ నానా నిందలేసి నీ నవ్వులే వెన్నెల్లని మల్లెలని హరివిల్లులని ఎవరేవేవో అంటె అననీ యేం చెప్పను యేవి చాలవని
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి